‘జట్టులో దాదాపు 10ఏండ్లుగా నేను భాగమై ఉండడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఈ కాలంలో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచాం. చాంపియన్స్ లీగ్ విజేతలుగా నిలిచాం. ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు ఆడాం. ఈ సందర్భంగా కొన్ని అపూర్వమైన వ్యక్తిగత ఇన్నింగ్స్ను గుర్తు చేసుకుంటున్నా’ అని డుప్లెసిస్ అన్నాడు. గతేడాది ఆర్సీబీపై ధోనీ ఇన్నింగ్స్తో పాటు 2013లో పంజాబ్పై రైనా చేసిన శతకాన్ని వివరించి, తనకు ఐపీఎల్లో అవే ఫేవరెట్ ఇన్నింగ్స్లు అని వీడియోలో పేర్కొన్నాడు.
గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీతో మ్యాచ్లో 162 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై ఓ దశలో 28 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. ఆ తర్వాత ధోనీ విశ్వరూపం చూపాడు. చివరి వరకు పోరాడి 48 బంతుల్లోనే 7సిక్సర్లు, ఐదు ఫోర్లతో 84 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 26పరుగులు చేయాల్సిన దశలో ధోనీ మూడు సిక్సులు, ఓ ఫోర్ కొట్టినా చివరికి ఓ పరుగు తేడాతో చెన్నై ఓడిపోవాల్సి వచ్చింది. కానీ మహేంద్రుడి పోరాటానికి మాత్రం అభిమానులు ఫిదా అయిపోయారు.